మీనం
వీరికి ఆదాయం –8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.
వీరికి ఏల్నాటి శని ప్రారంభమైనా మూర్తిమంతం చేత శుభకారకుడే. అలాగే, ధనస్థానంలో గురు సంచారం విశేష లాభదాయకంగా ఉంటుంది.
కీర్తిప్రతిష్ఠలు పెరిగి సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది.
అన్ని వ్యవహారాలలోనూ చురుగ్గా అడుగులు వేస్తారు.
ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడై మీరు అనుకున్నది సాధిస్తారు.
మీ మంచితనం ఇతరులను సైతం ప్రభావితం చేస్తుంది.
ధనాదాయానికి లోటులేకున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.
ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహం పెరుగుతుంది.
శత్రువులు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు.
మీలోని ప్రతిభకు తోడు వాగ్ధాటితో విజయాలు సాధిస్తారు.
బంధువులు, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి.
సంతానం విషయంలో మీ ఆశలు నెరవేరతాయి.
విద్యార్థులకు నూతనోత్సాహం, ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు.
అక్టోబర్ నుండి రాహు,కేతువుల ప్రభావం వల్ల కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది పడతారు.
చర, స్థిరాస్తుల కొనుగోలు పై కొంత సందిగ్ధత నెలకొన్నా ద్వితీయార్థంలో సత్ఫలితాలు పొందుతారు.
అవసరమైతేనే ప్రయాణాలు సాగించడం మంచిది.
ఆరోగ్యం పై కొంత శ్రద్ధ అవసరం.
వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు సామాన్యంగా ఫలిస్తాయి. వీరు భాగస్వాముల చర్యలతో కొంత కలత చెందుతారు. కొత్త పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు.
ఉద్యోగస్తులు విధులలో నిబద్ధత చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు.
పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి.
రాజకీయవర్గాల వారు కొన్ని వివాదాలలో చిక్కుకున్నా మనోధైర్యంతో బయటపడే అవకాశం.
కళాకారులు, వైద్య రంగాల వారికి ద్వితీయార్థంలో శుభదాయకంగా ఉంటుంది.
వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలిస్తుంది.
మహిళలు లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తారు.
వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిర మాసాలు విశేషంగా కలసి వస్తాయి. మిగతావి సామాన్యం.
ఇక వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.
రుద్రాభిషేకం, నరసింహస్వామి ఆరాధన మంచిది.