మిథునం
ఆదాయం-14 వ్యయం-2, రాజపూజ్యం-4, అవమానం-3.
ఈ రాశి వారికి మే 15 నుండి గురువు అనుకూలిస్తాడు.
శని, రాహు కేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు.
ఆదాయంతో పాటు, సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి.
మరోవైపు ఖర్చులు కూడా అధిగమించాల్సి వస్తుంది.
బంధువర్గం వారు సాయం అందించడంలో పాటు వారి నుండి ఒత్తిడులు కూడా పెరుగుతాయి.
పరిచయాలు మరింత పెరుగుతాయి.
కుటుంబ సభ్యుల కంటే స్నేహితుల సాయమే ఎక్కువగా లభిస్తుంది.
ఆర్థికపరమైన హామీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది.
కుటుంబంలో సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు.
ఆరోగ్యపరమైన సమస్యలు సైతం చికాకు పరుస్తాయి.
ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు.
జీవిత భాగస్వామి తరఫు నుండి ఎంతో కొంత ధన లేదా ఆస్తి లాభం కలుగుతుంది.
వారసత్వ ఆస్తి కూడా లభించవచ్చు.
ఇంటి నిర్మాణయత్నాలు ప్రథమార్ధంలో పూర్తి కాగలవు.
వివాహాది శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు.
తరచూ తీర్థయాత్రలు, దైవదర్శనాలు చేస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలతో పాటు కొద్దిపాటి ఆటుపోట్లు సైతం చూడాల్సి వస్తుంది.
ఉద్యోగస్తులకు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు.
ద్వితీయార్థంలో పదోన్నతులకు అవకాశం.
పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు, కొత్త సంస్థల స్థాపనకు శ్రీకారం.
రాజకీయవర్గాల వారు అనూహ్యమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కించుకుంటారు.
విద్యార్థులకు మంచి ఫలితాలు.
వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి.
ఏప్రిల్, జూలై, నవంబర్ నెలలు సామాన్యంగా ఉండవచ్చు.
వీరు తరచూ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం.
అదృష్టసంఖ్య-5